మన దేవాలయాలు తరతరాల చరిత్రకు,విశ్వాసాలకు సజీవ దృశ్యరూపాలు.
మన చారిత్రక,సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరాలకు అందించే వారధులు.
శివ,విష్ణు,శక్తి,గణపతి,కుమారస్వామి తదితర ఆలయాల్లో
వైదిక(స్మార్త),శైవ,వైఖానస,పాంచరాత్ర,శాక్త వంటి
పలు ఆగమవిధానాల ప్రకారం పూజాధికాలు జరుగుతుంటాయి.
నిత్యోత్సవ,పక్షోత్సవ,మాసోత్సవ సంవత్సరోత్సవాల్లో
ఆలయాల శోభ ద్విగుణీకృతమౌతుంది.
ప్రతి ఆలయానికీ ఒక విశిష్టత ఉంటుంది. అది ఆ ఆలయ స్థలపురాణం రూపంలో పొందుపరచబడి ఉంటుంది.
అటువంటి విశేషాలను అందించే ప్రయత్నం చేస్తాను.
No comments:
Post a Comment